టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ రాజమౌళి తాజాగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని సందర్శించారు.రాజమౌళి దంపతులకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అలాగే అదనపు కలెక్టర్ లు వరుణ్ రెడ్డి, రాజేశం రాజమౌళి కి ఘనంగా స్వాగతం పలికారు.
అంతేకాకుండా రాజమౌళి దంపతులకు మొక్కలను కూడా అందజేశారు.అక్కడికి వెళ్ళిన తర్వాత రాజమౌళి దంపతులు ముందుగా థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన కొమరం భీమ్ చిత్రపటానికి అంజలి ఘటించారు.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి వస్తుండటంతో ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయబద్దంగా నృత్యాలు వస్త్రధారణతో రాజమౌళి దంపతులకు ఘనంగా ఆహ్వానం పలికారు.
ఇక అక్కడికి జిల్లా అధికారులతో పాటు మహిళా సంఘాలు అలాగే స్థానికుల పెద్దలు భారీగా హాజరయ్యారు.రాజమౌళి దంపతులకు అక్కడున్న వారు ఘనంగా స్వాగతం పలకడంతో రమ, రాజమౌళి ఇద్దరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.అదేవిధంగా అసిఫాబాద్ లో ఇటీవల ప్రారంభించిన పిక్చర్ ట్యూబ్ థియేటర్ ను చూసిన రాజమౌళి దానిని ఏర్పాటు చేసిన మహిళా సంఘాలను అభినందించారు.
కొమరం భీమ్ పాత్ర ను ఉపయోగించి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాను కొమరంభీం మనవడు సోనేరావు తో పాటుగా గిరిజనులతో కలిసి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవలే ప్రారంభించిన పిక్చర్ ట్యూబ్ థియేటర్లో తిలకించారు.
అంతేకాకుండా ఆసిఫాబాద్ ప్రాంత గిరిజన పోరాట యోధుడు అయిన కొమరం భీమ్ ను తమ సినిమాలో చూపించేందుకు దర్శకుడు రాజమౌళి ఫై జిల్లా అధికారులు పొగడ్తల వర్షం కురిపించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇది ఇలా ఉంటే రాజమౌళి సతీమణి కలసి ఆసిఫాబాద్ ను సందర్శించడం తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 ని తెరకెక్కించబోతున్నారా? అందుకోసమే రాజమౌళి ఆ ప్రదేశాన్ని సందర్శించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరి ఈ విషయం పై రాజమౌళి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.