ఎన్నారై వ్యాపార వేత్త, ఎక్స్ ప్రెస్ న్యూస్ చానల్ అధినేత చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో అన్ని కొనాలని చెందించిన హైదరాబాద్ పోలీసులు మొత్తానికి కేసుని ఓ ముగింపుకి తీసుకొచ్చారు.ముందుగా జయరాంని రాకేశ్ రెడ్డి మాత్రమె అది కూడా అప్పు చెల్లించకపోవడం వలెనే హత్య చేసాడని భావించిన, కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్ది మర్డర్ మిస్టరీలో కీలక అంశాలు తెలుసుకున్నారు.
అసలు రాకేశ్ రెడ్డి, జయరాంకి ఎలాంటి అప్పు తెలుసుకున్న పోలీసులు, అతన్ని పథకం ప్రకారమే రాకేశ్ రెడ్డి హత్య చేసాడని, అతనికి వున్నా అమ్మాయిల వీక్ నెస్ ని అవకాశంగా చేసుకొని రాకేశ్ రెడ్డి జయరాం ఆస్తులు కొట్టేసే ప్లాన్ చేసి అతనికి హత్యకి ప్లాన్ చేసాడని పోలీసులు తెలుసుకున్నారు.
ఇక ఈ మర్డర్ లో రాకేశ్ రెడ్డికి మరో ముగ్గురు సహకరించారని, కూడా పోలీసులు తెలుసుకున్నారు.
రౌడీ షీటర్ నగేష్, అతని మేనల్లుడు కూడా ఈ హత్యలో భాగస్వామ్యం వుందని, వారంతా వారం రోజులు ముందుగానే జయరాంని హత్య చేయడానికి నిర్ణయించుకొని ప్లాన్ ప్రకారం సూర్య అనే ఆర్టిస్ట్ తో జయరాం ని రప్పించి, అతనితో ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు తీసుకొని తరువాత హత్య చేసారని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.దీంతో రాకేశ్ రెడ్డికి సహకరించిన రౌడీ షీటర్, అతని మేనల్లుడుని కూడా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఇందులో శిఖా చౌదరి పాత్ర ఎ స్థాయిలో వుంది అనే విషయాలని పోలీసులు నిర్ధారించలేదు.మొత్తానికి జయరాం మర్డర్ మిస్టరీ రోడ్ ఆక్సిడెంట్ నుంచి ఇలా ప్రీ ప్లాన్డ్ మర్డర్ క్రింద టర్న్ అయ్యి ముగింపు తీసుకోవడం విశేషం.