మనం తరచూ చూస్తూనే ఉంటాము ప్రతిరోజు ఏదో ఒకచోట ఖచ్చితంగా ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ జరిగి నిండు ప్రాణాలు ఎంతోమంది కోల్పోతున్న సంగతి.అయితే, కేంద్ర ప్రభుత్వం.
అలాగే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయాణికులకు ఎన్నిసార్లు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న అలాగే జాగ్రత్తలు తెలియజేస్తున్న గాని ప్రజలు మాత్రం వాటిని పాటించకుండా ఇష్టానుసారం ప్రయాణించడం చూస్తూనే ఉంటాం.దీంతో చివరికి ఎంతో మంది సొంత వారిని అనాధలను చేస్తూ వెళ్తుంటారు.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటాయి.హెల్మెట్ ధరించండి, నిర్దేశిత వేగంతో ప్రయాణించండి, ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఎన్ని విధాలుగా చెప్పినా కానీ వాటిని బేఖాతర్ చేస్తూ చివరికి ప్రాణాలను వదులుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ వారు ఓ ఫోటోని షేర్ చేస్తూ ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు.అయితే ఇందుకు సంబంధించి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో ప్రభాస్ హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఆ ఫోటో పై వియర్ హెల్మెట్ అనే హాష్ టాగ్ ను ఉంచారు.
ఈ విషయాన్ని తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ వారు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
ఈ ట్విట్టర్ లో పోలీసులు మీ జీవితమే కాదు.మీ కుటుంబసభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి.హెల్మెట్ ధరించండి అంటూ పోలీసులు తెలిపారు.అయితే నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఈ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
నేడు ప్రభాస్ తన 41వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.ఏది ఏమైనా హైదరాబాద్ పోలీసుల క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం.