మూడేళ్ళ పాప కిడ్నాప్... సినిమాను తలపించిన సస్పెన్స్ థ్రిల్లర్..?

హైదరాబాద్లో మూడేళ్ళ పాప కిడ్నాప్ పోలీసులకు సవాలుగా మారిపోయింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

 Hyderabad Police Trace Out 3 Years Old Girls Kidnap Case In Hours, Kidnap, Hyder-TeluguStop.com

వివరాల్లోకి వెళితే… బోయిన్ పల్లి కి చెందిన స్వరూప ఆంజనేయులు దంపతులు మధ్య గొడవ జరగడంతో భార్య స్వరూప తన మూడేళ్ల పాపను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది.ఇక సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకు చేరుకున్న స్వరూప తన మూడేళ్ళ పాప తో కలిసి ఫుట్పాత్ పై నిద్రిస్తున్న క్రమంలో… అక్కడే ఉన్న మరో మహిళ స్వరూప తో మాటలు కలిపింది.

అయితే ఇలా ఫుట్పాత్ పై ఒంటరిగా ఆడవాళ్లు ఉండడం ప్రమాదకరమని నమ్మబలికి సదరు మహిళ తనతోపాటు స్వరూప ను బాచుపల్లి కి తీసుకెళ్ళింది.ఇక రాత్రి అక్కడే స్వరూప తన మూడేళ్ల కూతురు తో కలిసి బసచేసింది.

ఇక పొద్దున్నే ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అయింది స్వరూపా… స్వరూప కూతురిని ఎలాగైనా కిడ్నాప్ చేయాలని భావించిన ఆ మహిళ ఇంటి దగ్గర దిగపెడతాను అంటూ నమ్మబలికింది.కాగా తల్లిబిడ్డల తో కలిసి ఆ మహిళ బస్టాండుకు చేరుకుంది.

ఇంతలో సదరు మహిళ ఆ చిన్నారిని కిడ్నాప్ చేయాలనుకున్న ప్లాన్ అమలు చేసింది.పాప ఆకలితో ఉంది ఏదైనా తినడానికి తీసుకురావాలని స్వరూప ను పంపిన ఆ మహిళ.

స్వరూప తిరిగి వచ్చేసరికి పాపతో ఉడాయించింది.దీంతో దిక్కుతోచని స్థితిలో స్వరూప పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా.

నిజాంబాద్ వెళ్లే బస్సులో పాపను ఆ మహిళ కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.దీంతో అన్ని పోలీస్ స్టేషన్లను ఒక్కసారిగా అప్రమత్తం చేసి గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్ కేసు చేయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube