హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో నివసించే ఓ ఏనుగు రికార్డు సృష్టించింది.ఆ ఏనుగు మీకు కూడా తెలిసి ఉండచ్చు.
ఎందుకంటే ఆ ఏనుగు వయసు 82 ఏళ్లు.దాదాపు ఎంతోమంది ఈ ఏనుగును చూసి ఉంటారు.
ఆ ఏనుగు పేరు రాణి.ఇంకా ఎందులో రికార్డు సృష్టించింది అని మీకు సందేహం వచ్చిందా?
అదేనండి.వయసులో.సాధారణ ఏనుగుల జీవిత కాలం కంటే ఎక్కువ రోజులు అంటే 82 ఏళ్ళ వయసు వరకు బతికి రికార్డు సృష్టించింది.స్వాతంత్య్రానికి పూర్వం నుంచి నగర సందర్శకులను కనువిందు చేస్తున్న రాణికి ఎలిఫెంట్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సన్మానం జరిగింది. నిజానికి సాధారణ ఏనుగులు 50 నుంచి 60 సంవత్సరాల వరకు జీవిస్తుంది.
కానీ రాణి మాత్రం 80 ఏళ్లుగా జీవిస్తుంది.ఎక్కువ కాలం బతికిన ఏనుగులతో రాణి కూడా నిలిచింది.
రాణి 1938 అక్టోబర్ 7న జన్మించింది.ఈ ఏనుగును 1963లో బహుదూర్పురాలో నెహ్రూ జూలాజికల్ పార్క్ కు తరలించారు.
రాణి 82 ఏళ్ళ వయసు వచ్చాక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం అరుదైన రికార్డు అని వెల్లడించారు.