కొందరు మనుషులు చాలా రాక్షసంగా ఉంటారు.వారిని చూస్తే నిజంగా ఈ మనిషిలో మానవత్వం చచ్చిపోయింది ఏమో అని అనిపిస్తుంది.
ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే మనిషి కాదు మృగం అని అనిపిస్తుంది.ఎంత దారుణంగా రాక్షసంగా ప్రవర్తించాడు అనేది చూస్తే మనిషిపై పీకలదాకా కోపం వస్తుంది.
హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి బతికున్న పిల్లిపై పెట్రోల్ పోసి లైటర్ వెలిగించి పడేశాడు.అది భాధను భరించలేక అటు ఇటూ పరిగెత్తుతూ ఒక చోట మరణించింది.
పైగా తాను చేసింది గొప్ప పని అన్నట్టు అతను చేసిన పని మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కర్కోటకుడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంకా ఈ వీడియో చూసినా హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ తీవ్రంగా స్పందించింది.ఈ అమానుష ఘటన చేసిన వ్యక్తి ఆచూకి చెపితే రూ.50 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.అంతేకాదు హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ పర్నా సేన్ గుప్తా కూడా తీవ్రంగా మండిపడ్డారు.
ఏది ఏమైనా మూగజీవాలపై ఇలా స్పందించడం సరైన పద్ధతి కాదు.