హైదరాబాద్ కార్మిక్ నగర్ లో ఓ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు.స్థానికంగా అక్కడ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్న 38 ఏళ్ల సిద్ధిక్ అహ్మద్ ను ఎవరో తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
హత్య చేసి ఆ మృత దేహాన్ని ఫ్రిజ్ లోనే ఉంచి ఇంటి బయట తాళం వేసి వెళ్లారు.ఆ ఇంటి నుండి దుర్వాసన రావడంతో అపార్ట్ మెంట్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తాళం పగుల కొట్టి చూడగా ఫ్రిజ్ లో సిద్ధిక్ అహ్మద్ మృతదేహం ఉంది.
మృతుని భార్య రుబీనా రెండు రోజుల క్రితమే పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిందని సమాచారం.
సిద్ధిక్ ను హత్య చేసింది ఎవరు.? ఆస్తి తగాదాలేమైనా ఉన్నాయా.? మరేదైనా కారణాల వల్ల హత్య చేశారా.? అన్నది పోలీసుల విచారణలో తేలుతుంది.భార్య భర్తల మధ్య తగాదాలు ఏమైనా ఉన్నాయా.సిద్ధిక్ ఎక్కడ పనిచేస్తున్నాడు.అతన్ని ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది.పోలీసులు యాక్షన్ లోకి దిగగా సిద్ధిక్ హత్యపై త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.