దేశంలో ఆడవాళ్ళకి ఏ విధంగా కూడా రక్షణ లేదని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.సమాజంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు చేసేవారికి కఠిన శిక్షలు వేసిన కూడా ఇంకా రహస్యంగా కొన్ని మృగాలు మగాళ్ళ రూపంలో సమాజంలో తిరుగుతూ సాదు జంతువుగా చలామణి అవుతూ అవకాశాలు సృష్టించుకొని అత్యాచారాలు చేస్తూ ఉన్నారు.అత్యాచారాలు చేయడానికి వారికి వృద్ధాప్యం కూడా అడ్డు రావడం లేదు.70 ఏళ్ల వయసులో నలుగురు భార్యలు ఉన్న ఓ వృద్ధుడుకి ఇంకా కన్నె పిల్లలు కావాల్సి వచ్చింది.ఈ నేపధ్యంలో హైదరాబాద్ వచ్చి అమ్మాయిలకి ఆర్ధిక సాయం చేస్తానని నమ్మించి వారి మీద అత్యాచారాలు చేయడం మొదలుపెట్టాడు.ఓ యువతీ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన మొహమ్మద్ సలీం తన నలుగురు భార్యలతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు.అయితే అమ్మాయిల కోసం తరచూ హైదరాబాదుకు వస్తుంటాడు.నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సాయం చేస్తానని చెబుతూ బంజారాహిల్స్ లోని తన ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడుతుంటాడు.23 ఏళ్ల ఓ యువతిని ఇంటికి పిలిపించుకుని, మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాధితురాలు పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసింది.ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
పోలీసుల విచారణలో సలీమ్ పలువురు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది.అతనిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.