మామూలుగా డైమండ్ రింగ్స్ లో మహా అయితే పదుల సంఖ్యలో వజ్రాలు పొదిగి ఉంటాయి.కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ నగల వ్యాపారి ఓ వజ్రాల ఉంగరం తో గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ది డైమండ్ స్టోర్ బై చందు భాయ్ యజమాని కొట్టి శ్రీకాంత్ తాజాగా ది డివైన్ – 7801 బ్రహ్మ వజ్ర కమలం పేరుతో ఈ ఉంగరాన్ని ఆయన తయారు చేశాడు.
ఇందుకు ఆయన బ్రహ్మ కమలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉంగరాన్ని తయారు చేశాడు.నిజానికి ఈ ఉంగరాన్ని గత సంవత్సరమే ఆవిష్కరించాడు.కాకపోతే దానిని గత సంవత్సరమే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దీనిని సబ్మిట్ చేశారు.అయితే అందుకోసం అనేక రౌండ్లు వెరిఫికేషన్ పక్రియ జరపగా చివరికి ప్రపంచంలోనే ఒక రింగ్ లో ఎక్కువ డైమండ్స్ పొదిగిన ఉంగరంగా గిన్నీస్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది ఈ ఉంగరం.
తాజాగా ఈ ఉంగరంకి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నందుకు కొట్టి శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇలాంటి అరుదైన పీస్ తయారు చేయాలన్న తన అభిరుచిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపాడు.ఇలాంటి ఉంగరం తయారు చేయాలని 2018 సెప్టెంబర్ లోనే అనుకున్నాడు.కానీ ఆది పూర్తయ్యేసరికి ఏకంగా 2019 ఆగస్టు నెల వరకు అయిందని తెలిపాడు.మొత్తంగా ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు తనకు 11 నెలల సమయం పట్టిందని ఇందులో మొత్తం ఆరు లేయర్లు ఉంటుందని ఆయన వివరించారు.
ఈ ఉంగరంలో ప్రతి లేయర్ లో 8 రేకులు ఉంటాయని అలా ఉంగరానికి మొత్తంగా 7801 వజ్రాలు పొదిగి ఉన్నాయని తెలిపారు.