సెల్ఫీలు ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ ఫ్యాషన్.తాము ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా అక్కడ సెల్ఫీలు దిగడం అత్యవసరం అన్నట్టుగా జనాలు తయారయ్యారు.
దీనికి అనుగుణంగానే సెల్ ఫోన్ కంపెనీలు కూడా సెల్ఫీ కెమెరా లకు ప్రాధాన్యత ఇస్తూ తమ ఉత్పత్తులను పెంచుకుంటున్నాయి.అయితే ఈ సెల్ఫీ మోజులో పడి చాలా మంది యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
అయినా ఎవరికి ఈ సెల్ఫీ మోజు తగ్గడం లేదు.ప్రమాదం జరుగుతుందని తెలిసినా రిస్క్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు.
నగరాల్లో అయితే దీని గురించి చెప్పనక్కర్లేదు.నిత్యం రద్దీగా ఉండే రోడ్లపైన ఆఫీసుల వద్ద సెల్ఫీలు దిగుతు మిగతా వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు.ఈ ధోరణి రోజు రోజుకి మరింత పెరుగుతుండడంతో దీనిని అదుపు చేసేందుకు హైదరాబాద్ అధికారులు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం నిషేధించేందుకు చర్యలు చేపట్టారు.
ఇప్పటికే హైదరాబాదులో 50 ప్రాంతాలను నో సెల్ఫీ జోన్ లుగా గుర్తించారు.ఆ నిషేధం ఉన్న ప్రదేశంలో ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటే వారికి పెనాల్టీ విధించడం గాని, లేక శిక్షించడం గాని చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కాబట్టి ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు దిగకుండా నో సెల్ఫీ బోర్డ్స్ ను గమనిస్తే మంచిది.