హైదరాబాద్ అంతా గులాబీమయంగా మారిపోయింది.నగరంలో ఎక్కడా చూసినా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
రేపు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో.నగరమంతా బీఆర్ఎస్, దేశ్ కీ నేతా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ రేపు తీర్మానం జరగనుంది.ప్రగతిభవన్ సహా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.
జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.