అతను మనోడే.అంటే హైదరాబాదు వాడు.
కానీ అతని కోరిక ఏమిటంటే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఇండియా మీద యుద్ధం చేయాలని.సల్మాన్ మొహియుద్దీన్ అనే ఇంజనీరు ఈ ఏడాది జనవరిలో దుబాయికి వెళ్ళే సమయంలో హైదారాబాదు ఎయిర్ పోర్టులో పట్టుబడ్డాడు.
అధికారులు అతన్ని ఇంటరాగేషన్ చేసినప్పుడు ఐఎస్ ఐఎస్ ఇండియా మీద యుద్ధం చేయాలనేది తన కోరికని చెప్పాడు.ఇతనికి సిరియా వెళ్లి ఇస్లామిక్ స్టేట్లో చేరాలని కోరిక.
ఆ ప్రయత్నంలో ఉండగానే పట్టుబడ్డాడు.ఐఎస్ ఐఎస్ లో చేరాలనే కోరిక ఎందుకు కలిగిందంటే … ఇతను అమెరికాలో పని చేసినప్పుడు వివక్షకు గురి అయ్యాడట.
ఐఎస్ ఐఎస్ లో చేరాలనుకున్న ఇతని భార్య కూడా పోలీసులకు పట్టుబడింది.ఈమె సంతతికి చెందిన మహిళ.
చివరకు భారతీయులే సొంత దేశానికి వెన్నుపోటు పొడిచేలా ఉన్నారు.ఇంకా ఎంతమంది ఇంటి దొంగలు ఉన్నారో మరి.