ఆస్పత్రిలో కరోనా పేషంట్ ఆత్మహత్య..!

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా శరవేగంగా విజృంభిస్తోంది.కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.

 Hyderabad, Corona, Peshent, Suicide-TeluguStop.com

వీరితో పాటు కరోనా ఉందని భయం, అనుమానంతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఏమైందో తెలియదు ఆస్పత్రి బాత్ రూమ్ లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్ మలక్ పేటలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి (60)కి కరోనా లక్షణాలు రావడంతో సమీప ఆస్పత్రిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నాడు.రిపోర్టులో కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని మలక్ పేటలోని యశోధ ఆస్పత్రిలో ఈ నెల 6న జాయిన్ చేయించారు.

అప్పటి నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్నాడు.

కాగా, సోమవారం రాత్రి ఆస్పత్రి కోవిడ్ వార్డులో ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్లి ఉరేసుకున్నాడు.

వాష్ రూం తలుపులు తెరవకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది తలుపు పగలగొట్టారు.అప్పటికే మృతి చెందడంతో సిబ్బంది చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube