పట్టపగలు నడిరోడ్డు పై హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.అందరూ చూస్తుండగానే నడిరోడ్డు లో ప్రేమ జంట పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ బస్టాండ్ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే… సంగా రెడ్డికి చెందిన యువకుడు,బోరుబండ కు చెందిన యువతి ప్రేమించుకున్నారు.
అయితే వారి ప్రేమను పెద్దలు ఒప్పోకోకపోవడం తో పెద్దలను ఎదిరించి వీరిద్దరూ కూడా జూన్ 5 న పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు.అయితే పెళ్లి తరువాత వీరిద్దరూ హైదరాబాద్ లో కాపురం పెట్టి తమకు రక్షణ కల్పించాలని సరూర్ నగర్ పోలీసులను కూడా ఆశ్రయించారు కూడా.
అయితే శుక్రవారం సాయంత్రం ఒక వాహనంలో బయటకు వెళ్లిన ఈ జంటను ఫాలో అయిన కొందరు దుండగులు సరిగ్గా ఎస్ ఆర్ నగర్ బస్టాండ్ వద్దకు రాగానే దుండగులు వారిపై దాడికి దిగారు.దీనితో ప్రియుడిని కత్తితో పలుమార్లు పొడవడం తో ఆ యువకుడికి తీవ్రంగా రక్తస్రావమైంది.
అయితే అందరూ చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నా ఏ ఒక్కరూ కూడా ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు సరికదా వీడియో లు తీసుకుంటూ కూర్చోవడం గమనార్హం.రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.గతంలో మిర్యాల గూడ లో కూడా ఆసుపత్రి సమీపంలో ప్రణయ్ అనే ప్రేమికుడి ని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది.ప్రణయ్,అమృతంల ప్రేమ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.