తెలంగాణ ప్రజలు మరియు రాజకీయ వర్గం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.టీ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలో నిలిచాడు.
ఈయన గత ఎన్నికల్లో ఉత్తమ్ మీద పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్థానంను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా శానంపూడి ఈసారి ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నాడు.
రెండు పార్టీలకు ఇది లైఫ్ అండ్ డెత్ అన్నట్లుగా పరిస్థితి ఉంది.అందుకే వారు వీరు అనే తేడా లేకుండా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేస్తున్న ఖర్చు సామాన్యులు నోరు వెళ్లబెట్టేలా ఉంది.
ముఖ్యంగా ఓటర్లకు పంచుతున్న డబ్బు, మద్యం కార్యకర్తలకు ప్రతి రోజు ముడుతున్న డబ్బులను చూస్తుంటే ఎన్ని వందల కోట్లు ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ఖర్చు చేస్తున్నాయో కదా అనిపిస్తుంది.ఉప ఎన్నికలేమో కాని ఓటుకు అన్ని పార్టీలు కలిపి కనీసం 10 వేల రూపాయలు అయినా ఇచ్చే అవకాశం ఉంది.
ఇంట్లో అయిదుగురు ఉంటే లక్ష రూపాయలు ఇచ్చేందుకు కూడా పార్టీలు వెనకాడటం లేదట.ఇంతగా డబ్బులు ఖర్చు చేస్తున్నా కూడా ఎలక్షన్ కమీషన్ మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.