ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం రాజకీయంగా హాట్ పిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇటు టిఆర్ఎస్ కంచుకోట హుజరాబాద్ లో గెలవాలనే ఉద్దేశంతో, రకరకాల వ్యూహాలను తెరతీస్తున్న టిఆర్ఎస్… అభ్యర్థిగా కాకుండా కెసిఆర్ సెంట్రింగ్ పార్టీ సెంట్రింగ్ రాజకీయ ప్రచారం జరుగుతోంది.
టిఆర్ఎస్వి ప్రెసిడెంట్ అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొత్తం టిఆర్ఎస్ తరఫున హుజురాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.అయితే టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఎక్కడా అభ్యర్థిని ఫోకస్ చేస్తూ ప్రచారం చేయడం లేదు.
ఎందుకంటే హుజురాబాద్ లో టిఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి ఈటెల రాజేందర్.ఇతనితో పోటీ పడాలంటే కచ్చితంగా పార్టీ సెంటర్ గా కెసిఆర్ సెంటర్ కా మాత్రమే ప్రచారం చేస్తున్నపరిస్థితి ఉంది.
ఎందుకు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రోజెక్ట్ చేయకుండా పార్టీ పరంగా వెళ్ళడం ఒక రాజకీయ వ్యూహంలో భాగం.
అయితే ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడ్డా ఇటు టీఆర్ఎస్ కాని, బీజేపీ కాని ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
అయితే ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది ఇప్పుడే ఒక క్లారిటి రాకపోయినా రానున్న రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యాక ప్రజల ఆలోచనలు వేగంగా మారుతుంటాయి.
అప్పుడు బీజేపీ ప్రచారం, ఇటు టీఆర్ఎస్ ప్రచారం కలుపుకొని ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు.అంతేకాక హుజూరాబాద్ లో బీజేపీ విజయం హరీష్ రావు భుజస్కంధాలపై ఆధారపడి ఉంది.అందుకే ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను గత్తెక్కించే పనిలో నిమగ్నమయి ఉన్నాడు.
అయితే ఇప్పటికే హుజూరాబాద్ లో అన్ని రకాల వర్గాల వారితో సమావేశమవుతూ టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరుతున్న పరిస్థితి ఉంది.మరి హుజూరాబాద్ లో ఎవరు విజయం సాధిస్తారనేది తెలియాలంటే మరిన్ని రోజులో వేచి చూడాల్సిందే.