తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందనే విషయాన్ని ప్రజలు మరచిపోయి చాలా కాలం అయినట్లుగా ఉందట.ఎందుకంటే గులాభి బాస్ ఎత్తులకు హస్తం చిన్నగా మారిపోయి చివరికి తన చిరునామను తానే మరచిపోయిందనే చవాకులు కూడా పేలుతున్నాయి.
ఇలాంటి సమయంలో బీజేపీ రంగంలోకి దిగి ఏదో ఉన్నంతలో కారు గుర్తును డ్యామేజ్ చేయాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది.ఇదే సమయంలో ఈటల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారడం తెలిసిందే.
ఇకపోతే ఈటల వర్సెస్ కేసీఆర్ కు మధ్య నడుస్తున్న పోరులో ఆటలో అరటిపడుంలా కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిని లాగారట.దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతు ఈటల రాజేందర్ పై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారట.
నీకు కెసిఆర్ కు జరుగుతున్న పంచాయితీలోకి మధ్యలో నన్ను లాగితే ఊరుకోనని హెచ్చరించారట కూడా.కాగా హుజూరాబాద్ లో ఈ కొత్త రగడ చోటు చేసుకోవడంతో అసలే రాజకీయ ఎత్తులతో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న నేతలు కొందరు చిర్రుబుర్రులాడుతున్నారట.