తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారు చేసారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
స్థానిక నేత కావడంతోపాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ నీ టిఆర్ఎస్ తరఫున బరిలోకి దిగినట్లు సమాచారం.ముఖ్యంగా స్థానికంగా మంచి పట్టు ఉండడంతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లిదండ్రులు కూడా ప్రజాప్రతినిధులు గా పనిచేసిన బ్యాక్ గ్రౌండ్ వుండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అందరికంటే ముందే హుజురాబాద్ ఉప పోరులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఇంతవరకు కాంగ్రెస్ అదే రీతిలో బిజెపి పార్టీలకు చెందిన అభ్యర్థి ఎవరు ప్రకటించలేదు ఆ పార్టీలు.
ఈ క్రమంలో అభ్యర్థి తో కలిసి ప్రచారం విషయంలో జనంలోకి మరింత దూసుకుపోతూ ఉంది టిఆర్ఎస్.ఇదే సమయంలో హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను మంత్రి హరీష్ రావు చేతికి టిఆర్ఎస్ హైకమాండ్ ఇచ్చినట్లు ఇప్పటినుండి పార్టీ అభ్యర్థి తో ఆచారం తో పాటు కీలక పాత్ర పోషించడానికి హరీష్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
టిఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించటంతో కార్య కర్తల లో కూడా జోష్ నెలకొంది.ఇదిలా ఉంటే జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు.ఉప ఎన్నికలలో పార్టీని గెలిపిస్తాయని టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.