తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే అన్ని పార్టీలూ నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
అయితే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఖాయమైనప్పటికీ టీఆర్ ఎస్ నుంచి ఎవరన్నదీ ఇంకా సస్పెన్స్గానే ఉంది.కానీ ఆ పార్టీ నేతలు మాత్రం అభ్యర్థి లేకుండా అన్ని ఊర్లను చుట్టేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గానికి స్పెషల్ గా నిధులు కేటాయించి మరీ అభివృద్ధి పథకాలను మంత్రులే దగ్గరుండి చూసుకుంటున్నారు.
మరి ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం తేలకున్నా.
అసలు ఎన్నికలు ఎప్పుడొస్తాయనేదానిపై అందరికీ ఆసక్తిగానే ఉంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఉప ఎన్నిక ఎప్పుడొస్తుందనే దానిపై టీఆర్ ఎస్ కీలక నేతలకు ఇంటిమేషన్ వెళ్లినట్టు స్పష్టమవుతోంది.
కరోనా ఇప్పుడు కుదుట పడటంతో సెప్టెంబర్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే అక్బోబర్ నుంచి థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
అంటే సరిగ్గా ఇంకా రెండు నెలల టైమ్ ఉందన్న మాట.ఈలోపు హుజూరాబాద్లో అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేసి పాజిటివ్ వేవ్ సృష్టించుకోవాలని టీఆర్ ఎస్ కీలక నేతలు భావిస్తున్నారు.అప్పటి వరకు ఈటలపై ఉన్న సానుభూతి కూడా కొంత తగ్గుతుందని ఆలోచిస్తున్నారు.ఇంకోవైపు తమ అభ్యర్థిని కూడా డిసైడ్ చేసుకోవచ్చనే ప్లాన్లో టీఆర్ ఎస్ ఉంది.మరి ఈ ఆలస్యం కాస్త అమృతంలా మారుతుందా లేక విషయంగా మారుతుందా అనేది తెలియాంటే ఎన్నిక రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.కానీ ఈటల రాజేందర్మాత్రం పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
మండలానికో ఇన్చార్జిని నియమించి మరీ ప్రచార హోరు సాగిస్తున్నారు.