హైదరాబాద్ లంగర్హౌజ్లో కిడ్నాపర్లు రెచ్చిపోయారు.ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ పై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
ముందుగా ఇర్ఫాన్ ను కేటుగాళ్లు రాజేంద్రనగర్ కు తీసుకెళ్లారు.అనంతరం నగ్నంగా ఉంచి చితక్కొట్టారని తెలుస్తోంది.
పాతకక్షల నేపథ్యంలో దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గతంతోనూ ఇర్ఫాన్ పై కిడ్నాపర్లు దాడి చేసారు.
బాధితుడు ఇర్ఫాన్ పోలీసులను ఆశ్రయించాడు.దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.