మామిడి పళ్లు ఇవ్వలేదని భార్యని కడతేర్చిన భర్త ...!

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం.మామిడి పండ్లు ఇవ్వలేదన్న కారణంతో మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఒక భర్త.

 A Husband Who Murdered His Wife For Not Giving Mango Fruit, Husband, Mangoes, Mu-TeluguStop.com

ఈ దారుణమైన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి మద్యం తాగి ఇంటికి రావడం జరిగింది.

తాను తినడానికి మామిడిపండ్లు ఇవ్వమని కార్తిక్ తన భార్యను అడిగాడు.

దీనితో ఆమె పిల్లలు మామిడి పండ్లను తిన్నారు ఇంకా లేవు అని చెప్పడంతో… కార్తీక్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై బొంగు కర్రతో ఆమెను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది.

దీంతో ఆమెకు బలమైన గాయాలు అవడంతో అక్కడికక్కడే స్పృహ కొల్పోయింది.అయితే ఆ సమయంలో ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు చేరుకునే సరికి ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది.

రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది.

అయితే అప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది.

ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.బాధితురాలికి దెబ్బలు బలంగా అవ్వడంతోనే ఆమె చనిపోయినట్లు డాక్టర్ లు తెలియజేశారు.

ఇక స్థానికులు అందజేసిన సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి పోలీస్ అధికారులు తీసుకొన్నారు.అంతే కాకుండా పూర్తి సమాచారం కొరకు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube