పెళ్లై మూడు నెలలు అయింది.అనుమానంతో పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి.
పెళ్లయిన నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకుని చేతికి పారాణి ఆరక ముందే కడతేడ్చాడు.
అనుమానంతో పెనుభూతమై ఓ నవ వధువును హతమార్చిన ఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది.
పెళ్లి చేసుకున్న మూడు నెలలకే కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు.పులివెందులకు చెందిన అశోక్ అనే వ్యక్తి వీరమ్మ అనే యువతిని 3 నెలల కిందట వివాహం చేసుకున్నాడు.
పెళ్లి అయిన రోజు నుంచి భార్యపై అనుమానం పెనూ భూతంగా మారింది.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో వీరమ్మను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
హత్య చేసి పులివెందులలోని శిల్పారామం దగ్గర పూడ్చి పెట్టాడు.
మూడు రోజులుగా వీరమ్మ కనిపించకపోవడంతో బంధువులు అనుమానం వచ్చి అశోక్ ను అడిగారు.
పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో యువతి బంధువులు పోలీసులను ఆశ్రయించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
దీంతో అశోక్ జరిగిన విషయాన్ని చెప్పాడు.తన భార్య వీరమ్మను పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించడంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ మేరకు పోలీసు హత్య కేసుగా నమోదు చేసుకుని అశోక్ ను అరెస్ట్ చేశారు.