సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు చిత్తుకాగితాలుగా మారుతున్నాయి.ముఖ్యంగా నేటి కాలపు మనుషులు డబ్బు మద్యం లాంటి చెడు వ్యసనాల మాయలో పడి పచ్చని సంసారాలను, అందమైన కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.
హంతకులుగా, ద్రోహులుగా మారుతున్నారు.చివరికి నమ్ముకున్న వాళ్లను చంపడానికి కూడా వెనకాడటం లేదు.
తాజాగా జరిగిన ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.కుటుంబ కలహాల నేపధ్యంలో కట్టుకున్న భార్యను, కన్న కూతురిని అత్యంత దారుణంగా చంపినాడు ఓ వ్యక్తి.కరీంనగర్ జిల్లా, హుజురాబాద్లో జరిగిన ఈ ఘటన స్దానికంగా కలకలం సృష్టిస్తుంది.
వెంకటేష్ అనే వ్యక్తి తన భార్య రమను, కూతురు ఆమనిపై ఇనుపరాడ్తో దాడిచేయగా తీవ్రంగా గాయపడిన తల్లి కూతురు అక్కడికక్కడే మరణించారు.
దీంతో భయపడిన నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.
కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్దలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఇక ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
.