భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది.పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.
కరోనా వల్ల దేశం పదేళ్లు వెనక్కు వెళ్లిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయంటే వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో సులభంగానే అర్థమవుతుంది.కరోనా వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
అయితే కొందరు కరోనాను అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యులనే మోసం చేస్తుండటం గమనార్హం.
నావీ ముంబైకు చెందిన వ్యక్తి ప్రేయసితో జాలీగా గడపాలని అనుకున్నాడు.
అయితే అందుకోసం భార్యకు ఏం అబద్ధం చెప్పాలో తెలియక కరోనా సోకిందని చెప్పాడు.అయితే భర్త చెప్పింది విని భయపడి ఆ భార్య చేసిన పని భర్త భాగోతం వెలుగులోకి రావడానికి కారణమైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే నావీ ముంబై లోని తలోజా ప్రాంతానికి చెందిన మనీష్ మిశ్రాకు ఒక యువతితో వివాహేతర సంబంధం ఉండేది.
మనీష్ పెళ్లైనా వివాహేతర సంబంధాన్ని మాత్రం కొనసాగించేవాడు.
భార్యకు కరోనా సోకిందని చెప్పి ప్రియురాలితో సంతోషంగా గడపాలని ప్లాన్ వేసిన మనీష్ భార్యకు కరోనా సోకిందని చెప్పిన తరువాత ఫోన్ స్విఛాఫ్ చేశాడు.దీంతో అతని భార్య కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీష్ మిశ్రా లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
అతని చివరి లొకేషన్ దగ్గర బైక్ కనిపించింది.
అనంతరం పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మనీష్ మిశ్రా మరో యువతితో షికారు కొడుతున్నట్టు తేలింది.అనంతరం అతడిని గుర్తించి పోలీసులు అతని భార్యకు అసలు విషయాలను వెల్లడించారు.
ముంబై నుంచి మనీష్ తన ప్రేయసితో కలిసి ఇండోర్ కు వెళ్లగా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండగా ఇలాంటి భర్తలు కూడా ఉంటారా….
అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.