ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి.భార్య భర్తల గొడవలకు కారణం అక్రమసంభందాలు.
దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.పరాయి వ్యక్తిపై మోజు పెంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి.
ఇలాంటి సంభంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి.
అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని భార్యను చంపడం లేదా భర్త అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో చంపించడం వంటి వాటి వల్ల పిల్లలు అనాధలుగా మారుతున్నారు.
ఇలాంటి ఘటనలు తరచు చాలానే చూస్తున్నాం.
తాజాగా జరిగిన ఘటన కూడా ఇలాంటిదే.
తన అక్రమ సంభందానికి అడ్డు వస్తుందని భార్యతో విడాకులు తీసుకోవాలనుకున్నాడు.అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను ప్రియురాలితో కలిసి వేధింపులు చేయడం మొదలుపెట్టాడు.
వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో వివేక్ వీరేంద్ర సింగ్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు.
అతడికి పెళ్లి అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది.అతిథి ఈ మధ్య వివేక్ కు ఒక మహిళతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.
అయితే తనను పెళ్ళి చేసుకోవాలని ప్రియురాలు కోరడంతో వివేక్ కు ఏమి చేయాలో అర్ధం కాలేదు.
చివరకు భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే విడాకులు కావాలని గత సంవత్సరం కోర్టులో పిటిషన్ వేసాడు.
అయితే వివేక్ భార్య మాత్రం విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.కోర్టులో విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పి మెలిక పెట్టింది.
విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదని వివేక్, ప్రియురాలితో కలిసి భార్యను వేధించసాగాడు.ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.అయితే రెండు రోజుల క్రితం ఆమెను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడకు వెళ్తే అక్కడకు అనుసరించసాగారు.దీంతో ఆమెకు అనుమానం వచ్చి తన వాహనాన్ని చెక్ చేస్తే ఓ ట్రాకింగ్ సిస్టమ్ బయటపడింది.
ఇలాంటి ఆలోచన తన భర్తదే అని ఆమెకు అనుమానం వచ్చింది.తనను వెంబడించేందుకు మనుషులను కూడా పెట్టుకున్నాడని తెలుసుకుంది.
ఈ విషయం గురించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమె కేసు పెట్టింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.