పూర్వకాలంలో రాముడు సీతకి శీల పరీక్ష కోసం సీతని అగ్నిప్రవేశం చేయమన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కలియుగంలో కూడా ఓ రాముడు తన భార్యను నిప్పుల్లో నడిచి ఎటువంటి గాయాలు కాకుండా బయటకు వస్తే అప్పుడు నిన్ను ఏలుకుంటా అంటూ అగ్ని పరీక్ష పెట్టాడు.
ప్రస్తుత సమాజంలో ఇలాంటి కొందరు మనుషుల వింత పోకడలు భార్య భర్తల పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి.
బీహార్లోని పాట్నా ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర బింద్ అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం అయింది.
పెళ్లైన మొదట్లో లో వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా ఉండేది.అయితే సురేంద్రకు ఎటువంటి ఉద్యోగం లేనందున పెళ్లయిన ఐదేళ్ల వరకు ఆ మహిళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేది.
అయితే పెళ్లయిన ఐదేళ్ల తర్వాత సురేంద్ర బింద్ కి సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది.అయితే ఈ క్రమంలో ఉద్యోగంతో పాటు అతని ప్రవర్తనలో మార్పు కూడా వచ్చింది.
ఇందులో భాగంగా సురేంద్ర ఆమెను రోజూ పలు వేధింపులకు గురి చేసేవాడు.
అయితే తాజాగా ఆమెను ఏకంగా అగ్నిప్రవేశం చేయాలని వేధించసాగాడు.అంతేగాక అగ్ని ప్రవేశం చేసి ఎటువంటి గాయాల బారిన పడకుండా బయటికి వస్తే అప్పుడు తను ఏలుకుంటానని లేకపోతే వదిలేస్తానని షరతు కూడా పెట్టాడు. దీంతో ఆ మహిళ ఏం చేయాలో తెలియక రాష్ట్ర మహిళా కమిషన్ సంప్రదించి తన గోడును విన్నవించింది.
దీంతో మహిళా కమిషన్ అధికారులు రంగంలోకి దిగి ఆ కలియుగ రాముడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.