అమ్మఒడి కార్యక్రమం ద్వారా పెద పిల్లలు చదువుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో 15000 రూపాయలను జగన్ ప్రభుత్వం జమ చేసింది.ఈ నేపథ్యంలో ఆ డబ్బులు ఓ అభాగ్యురాలి ప్రాణాలను తీసింది.
తాగేందుకు అమ్మఒడి డబ్బులు ఇవ్వాలని భార్యను బండ రాయితో మోది చంపిన భర్త… అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయితీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తాముల భీమన్న, దేవుడమ్మ లు భార్య భర్తలు వీరికి నలుగురు పిల్లలు.
అమ్మఒడి ద్వారా తమ ఖాతాలోకి వచ్చిన డబ్బును పిల్లల చదువుకోసం ఉపయోగపడుతుందని అనుకున్న దేవుడమ్మ, తనకు తాగేందుకు ఆ డబ్బులు ఇవ్వాలని ఆమె భర్త భీమన్న కోరాడు.
భర్త చేతికి డబ్బులు ఇస్తే రావని గ్రహించిన ఆమె అందుకు నిరాకరించింది.ఈ క్రమంలో సరుకుల కోసం మార్కెట్ కు వెళ్లారు.ఆ సమయంలో దారి పొడువును ఆ డబ్బును తనకు ఇవ్వాలిసిందిగా భార్యను సత్తాయించాడు భీమన్న.
ఆమె ఎంతకి ఆ డబ్బు ఇచ్చేది లేదని చెప్పడంతో పక్కనే ఉన్న బండ రాయితో ఆమె తలపై బాది చంపాడు.
దేవుడమ్మ అక్కడికక్కడే ప్రాణాలను విడిచిపెట్టింది.ఈ విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిండుతుదిని అదుపులోకి తీసుకున్నారు.
మొదట ఆ హత్య నేను చెయ్యలేదని భూకాయించిన ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు.