ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాంఢవం చేస్తోంది.కరోనా కారణంగా అమెరికా ఇటలీ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
ప్రాణ నష్టంలో ఇటలీ మరీ దారుణ పరిస్థితులు ఎదుర్కొంది.ఇటలీ దేశంలో పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ సమయంలో స్థానిక ప్రభుత్వం విడుదల చేసిన ఒక జాబిత దేశ ప్రజలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా మనోవేదనకు గురి చేస్తోంది.
కరోనా పేషంట్స్కు చికిత్స అందించిన 100 మంది డాక్టర్లు కరోనా వ్యాది సోకి మృతి చెందారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రిటైర్డ్ డాక్టర్స్ను 70 ఏళ్లు దాటి రిటైర్డ్ అయిన డాక్టర్స్ను కూడా ఇటలీ ప్రభుత్వం ఆహ్వానించింది.కొన్ని వేల మంది డాక్టర్స్ లక్షల మంది ప్రాణాలు కాపాడారు.
కాని 100 మందికి పైగా డాక్టర్లు అదే కరోనా మహమ్మారి సోకి మృతి చెందడం బాధకర విషయం.ఈ సమయంలో ప్రతి డాక్టర్ ప్రాణం ఎంతో ముఖ్యం.
అందుకే ప్రపంచంలోని అంతా కూడా డాక్టర్స్కు సెల్యూట్ చేస్తున్నారు.