మానవత్వం మంట కలిసిన వేళ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక దారుణ సంఘటన జరిగింది.ఒక వృద్ధుడు తన అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలో చూపించుకొని పూర్తి డబ్బులు కట్టకపోవడంతో ఆ ఆసుపత్రి యాజమాన్యం వారు ఆ వృద్ధుడిని ఒక బెడ్ కు తాళ్లతో కట్టేసిన అమానుష సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

 Humanity Is Not Available At This Stage...coronavirus, Madhyapradesh, Sivaraj Si-TeluguStop.com

ఇక ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆ ఆసుపత్రి పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఇకపోతే ఆ వృద్ధుడు చికిత్స నిమిత్తం 11 వేల రూపాయలు ఖర్చు అవ్వగా… అందులో కేవలం ఐదు వేల రూపాయలు తాము ఆసుపత్రిలో చేరే ముందరే ఆస్పత్రి యాజమాన్యానికి కట్టమాని సదరు వృద్ధుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇకపోతే చాలా రోజులుగా వృద్ధుడికి చికిత్స అందిస్తున్న కారణంగా 11000 కావడంతో మేమంత చెల్లించలేకపోవడంతో ఆసుపత్రి వారు అలా చేశారని వారు వాపోయారు.

ఇకపోతే ఈ అంశంపై హాస్పిటల్ యాజమాన్యంని విచారించగా అసలు ఆ వృద్ధుడికి బ్రెయిన్ డిజాస్టర్ కావడంతో తనను తాను ఈ స్థితికి చేరుకున్నాడు అని అందుకే ఇలా మేము చేశామని వారు స్పష్టంగా తెలుపుతున్నారు.

అంతే కాకుండా మేము మానవతా దృక్పథంతో అతని బిల్లు కూడా పూర్తిగా మాఫీ చేశామని వారు తెలియజేస్తున్నారు.నిజంగా ఇలా ఆ వృద్ధుడిని మంచానికి కట్టేసి వైద్యం చేయడం చాలా అమానుషమే కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube