భారత దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది.మానవ జీవితాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది ఈ మహమ్మారి ప్రాణాంతకమైన రక్కసి.
ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.కనీసం కుటుంబ సభ్యులు కడచూపు కూడా నోచుకోని దుస్థితిని తీసుకొచ్చింది కరోనా రక్కసి.
కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారికి వైద్య సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.కానీ ఈ అంత్యక్రియల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం… ఎంతో మందిని కలిచి వేస్తోంది.
ఇటీవలే బళ్లారిలో కరోనా వైరస్ బాధితుల శవాన్ని గుంతలోకి విసిరేసిన ఘటన మరువక ముందే కర్ణాటకలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
యాదగిరి జిల్లా లో పిపిఈ సూట్ లు ధరించిన సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతి దారుణంగా ఈడ్చుకువెళ్లి అంత్యక్రియలు జరిపిన విషయం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.
గ్రామస్తులు ఆ శవాన్ని తమ పొలాల వద్ద పూడ్చేందుకు నిరాకరించటంతో.వైద్య సిబ్బంది వేరొక స్థలంలో అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు అక్కడికి అంబులెన్సు వెళ్లే దారి లేకపోవడంతో దారుణంగా కరోనా బాధితుడి శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లారు.