ఈ మధ్యకాలంలో ఇండియన్ సెలబ్రిటీలు హాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వరుసగా హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
అలాగే దీపికా పదుకునే కూడా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.ఆమె రెండో సినిమాకి కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది.
అలాగే రాధికా ఆప్టే కూడా హాలీవుడ్ మూవీలు చేస్తుంది.ఇక అనిల్ కపూర్ లాంటి నటులు హాలీవుడ్ లో అప్పుడప్పుడు మెరుస్తున్నారు.
ప్రస్తుతం సౌత్ స్టార్ ధనుష్ తన రెండో హాలీవుడ్ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
అలాగే తెలుగమ్మాయి శోభిత దూలిపాళ్ళ కూడా హాలీవుడ్ లో అడుగుపెడుతుంది.ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోయిన్ హ్యూమాఖురేషి ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ప్రముఖ ఒటీటీ చానల్ నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో హ్యూమా నటించింది.ఆమె నటించిన ఆర్మీ ఆఫ్ ది డెడ్ అనే వెబ్ సిరీస్ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇంగ్లీష్ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ భారీ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ లో హ్యూమా ఖురేషీ చాలా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కాలా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తమిళంలో అజిత్ వాలిమై సినిమా లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం
.