మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వెంటనే అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.కాగా మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇండియన్ అగ్ర దర్శకులు అయినా రాజమౌళి, శంకర్ లతో ఈయన బ్యాక్ టు బ్యాక్ పని చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.ఇలా ఇప్పుడు ఉన్న స్టార్ దర్శకులిద్దరితో పని చేసిన ఘనత ఈయనకే సొంతం.
మరి ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని శంకర్ కూడా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అలాగే రామ్ చరణ్ లుక్ లో కూడా విభిన్నంగా చూపించ నున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాండ్ గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూల్స్ ముగించారు.
మరొక రెండు షెడ్యూల్స్ అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.
దిల్ రాజు భారీ బడ్జెట్ తో న నిర్మిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో మరొక బాలీవుడ్ బ్యూటీ కూడా ఉందని తాజాగా టాక్ వినిపిస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించ నుందని.అది కూడా చాలా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ఈమె నార్త్ రాజకీయ నాయకురాలిగా చాలా కీలకమైన పాత్రలో నటిస్తుందని.
వార్తలు వస్తున్నాయి.మరి ఇదే కనుక నిజం అయితే ఈమె ఈ పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.