చట్టం ఎవరి చుట్టం కాదు.న్యాయం దృష్టిలో అందరు సమానమే కానీ కొందరు మాత్రం న్యాయాన్ని బజార్లో నిలబెట్టాలని ప్రయత్నిస్తారు.
ఆ సమయంలో చట్టంలోని మనుషులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తే చట్టానికి విలువ మరింత పెరుగుతుంది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న వారి పేర్లు, అధికారుల పేర్లు చెప్పుకుని జులుం చలాయిస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు.
అంతే కాకుండా కొందరి నేతల, పోలీస్ అధికారుల కొడుకులు కూడా విచక్షణ మరచి అహాంకారంతో ప్రవర్తిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
కేపీహెచ్ బీ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే.ఓ పోలీసు అధికారి కుమారుడు అతని స్నేహితుడితో కలసి రోడ్డు పై హల్ చల్ చేశారు.
రోడ్డు పక్కన సోడాలు అమ్మే వ్యక్తితో మందులో కలుపుకోవడానికి నీళ్లు ఇవ్వాలి అంటూ గొడవకు దిగారు.
వీరి ఆగడాలకు విసిగిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్దలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారట.
కాగా వీరి విచారనలో ఆ ఇద్దరు యువకుల్లో ఒకరి తండ్రి ఎఆర్ లో అదనపు ఎస్పీ కాగా, మరొకతను డాక్టర్ అరుణ్ అని తేలిందట.మద్యమత్తులో ఉన్న వీరి పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
మరి న్యాయం ఇక్కడ అన్యాయం అవుతుందా, లేక తన విలువ కాపాడుకుని ఇలాంటి వారికి శిక్షపడేలా చేస్తుందా చూడాలి.