మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగించుకున్ సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఓ తాజా అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
ఆచార్య సినిమాలోని కీలక సన్నివేశాలకు సంబంధంచిన షూటింగ్ను దేవాలయం బ్యాక్డ్రాప్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ దేవాలయ సెట్ను వేస్తున్నారట.
ప్రస్తుతం నెలకొన్ని కరోనా వైరస్ పరిస్థితులు చక్కబడ్డాక ఈ సెట్లో చిరు షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తోంది.ఈ సినిమాలో చిరు ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇందులో భాగంగా దేవాలయాల్లో జరిగే అక్రమాలను చిరు ప్రశ్నించే తీరు ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.
అయితే చరణ్ ఈ సినిమాలో ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.కాగా ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా రామ్ చరణ్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు.
మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.