అదేంటోగానీ టీఆర్ ఎస్ అధిష్టానం వేసిన ఎత్తుగడలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి.హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ను ఏకాకిని చేయాలని, అతడి వర్గీయులను బేరం ఆడి మరీ కొనడానికి ప్రయత్నించింది అధికార పార్టీ.
ఆ క్రమంలో చాలామంది ఈటలకు వ్యతిరేకంగా అప్పట్లో ప్రెస్మీట్లు కూడా పెట్టారు.కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది.
ఎప్పుడైతే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారో అప్పుడే హుజూరాబాద్ వేడెక్కింది.
ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవరు ఎప్పుడు ఎటువైపు నిలుస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈటల నియోజకవర్గమంతా పర్యటిస్తూ వ్యతిరేకంగా మారిన వారితో మంతనాలు జరపడంతో వారంతా మళ్లీ ఈటల గూటికే చేరుతున్నారు.ఈ క్రమంలో చాలామంది ఇప్పటికే టీఆర్ ఎస్కు రాజీనామాలు చేశారు.
ఇది వరకే కమలాపూర్ ఎంపీపీ, మండల అధ్యక్షుడు టీఆర్ ఎస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.హరీష్రావు లాంటి రాజకీయ దిట్ట రంగంలోకి దిగినా పెద్దగా ఎఫెక్ట్ చూపట్లేదని సమాచారం.ఇందులో భాగంగా వరుసగా టీఆర్ ఎస్కు భారీగానే షాక్లు తగిలుతున్నాయి.
ఇదే క్రమంలో ఈ రోజు హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల నాయకులు రాజీనామాలు చేశారు.ఇందులో టీఆర్ ఎస్ యూత్ విభాగానికి చెందిన వారే 100మందికి పైగాఉన్నారు.
వీరంతా హుజూరాబాద్లోని మెయిన్ సెంటర్ అయిన గాంధీ చౌరస్తా వద్దకు చేరుకుని టీఆర్ ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో టీఆర్ ఎస్కు ఈ ఐదు మండలాల్లో గట్టి పట్టు కోల్పోయినట్టే అనిపిస్తుంది.
రాబోయే రోజుల్లో మరింత మంది టీఆర్ ఎస్ను వీడే అవకాశం ఉంది.మొత్తానికి ఈటల రాజేందర్ రాజకీయాలు బాగానే పనిచేస్తున్నాయి.
ఇది టీఆర్ ఎస్కు మింగుడు పడని అంశం.దీన్ని బట్టి చూస్తే ఈటలకు నియోజకవర్గంలో ఏ స్థాయిలో పట్టుందో అర్థమవుతుంది.
తాజా వార్తలు