స్టార్ హీరోయిన్ సమంత యశోద సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే నిర్మాతకు చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలు వచ్చాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు యశోద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే సమంత మూవీకి మరో షాక్ తగిలిందని తెలుస్తోంది.
ఈ సినిమాను ఓటీటీలో ఇప్పుడే రిలీజ్ చేయొద్దంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.సినిమాలో చేసిన ఒక చిన్న తప్పు వల్ల యశోద మూవీ మేకర్స్ కు కొత్త సమస్య ఎదురైంది.
ఈ సినిమాలో ఇవా ఐవీఎఫ్ అనే పేరును వాడగా ఇప్పటికే ఆ పేరుతో ఉన్న ఆస్పత్రి కోర్టు మెట్లెక్కింది.డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయకూడదని కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే ఓటీటీ రిలీజ్ డేట్ మారడం వల్ల ఓటీటీ సంస్థ నుంచి నిర్మాతలకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.ఓటీటీ సంస్థ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు ఉండటంతో పాటు ముందుగా ఆఫర్ చేసిన మొత్తం కంటే తక్కువ మొత్తం ఇస్తానని వెల్లడించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఇందుకు సంబంధించి ఓటీటీ సంస్థ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.
యశోద నిర్మాత ఆస్పత్రి నిర్వాహకులతో చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని మరి కొందరు సూచనలు చేసుండటం హాట్ టాపిక్ అవుతోంది.సమంత ఈ వివాదానికి సంబంధించి జోక్యం చేసుకోవాలని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం.సమంత తర్వాత సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.