నాగచైతన్యతో విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు సమంత ( Samantha ) విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.శాకుంతలం సినిమా( Shaakuntalam ) వచ్చే నెల 14వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమా 80 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా దేవ్ మోహన్( Dev mohan ) ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రలో కనిపించారు.అయితే తెలుగు హీరోలు దుశ్యంతుడి పాత్రలో నటించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.
కనీసం ఇతర భాషల్లో పాపులారిటీ ఉన్న నటుడిని ఈ సినిమా కోసం తీసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే గుణశేఖర్ మాత్రం చాలామంది టాలీవుడ్ హీరోలను పరిశీలించి వాళ్లు నో చెప్పడంతో చివరకు మలయాళ హీరోలపై ఆధారపడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
దుల్కర్ సల్మాన్ ను ఈ సినిమాలో తీసుకోవాలని భావించినా అప్పటికే దుల్కర్ సీతారామం సినిమాకు ఓకే చెప్పడంతో దేవ్ మోహన్ ను ఎంపిక చేశామని ఆయన అన్నారు.
టాలీవుడ్ స్టార్స్ సమంత విషయంలో దారుణంగా వ్యవహరించారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సమంతకు జోడీగా నటించడానికి టాలీవుడ్ హీరోలకు ఇబ్బందేంటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్నో సినిమాల సక్సెస్ లో సమంత కీలక పాత్ర పోషించారని కానీ సమంతకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టాలని ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ సాధించేలా జాగ్రత్త వహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.శాకుంతలం రిజల్ట్ సమంత కెరీర్ ను డిసైడ్ చేయనుంది.ఈ సినిమాపైనే సమంత రెమ్యునరేషన్ ఆధారపడి ఉంది.సమంత ఖుషి మినహా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదు.అయితే ఇతర భాషల్లో వెబ్ సిరీస్ లతో సమంత బిజీ అవుతున్నారు సమంత కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.