ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్ సంస్థ ఇటీవల ఐఓఎస్ 15 అప్డేట్ని విడుదల చేసింది.సెప్టెంబరు 20 నుంచి యూజర్లకు ఈ కొత్త ఐఓఎస్ అప్డేట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో సంతోషించిన యూజర్లు ఎంతో ఆసక్తితో కొత్త ఓఎస్ను అప్డేట్ చేశారు.ఐతే కొత్త ఓఎస్తో ఫోన్లోని టెక్నికల్ ఫాల్ట్స్ పోతాయనుకుంటే.
దానికి భిన్నంగా కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి.దాంతో యూజర్లు షాక్ అవుతున్నారు.
కొత్త ఐఓఎస్ అప్డేట్ చేసి.మెసేజెస్ యాప్లో ఫొటోస్ థ్రెడ్ని డౌన్లోడ్ చేశాక ఓ సమస్యను గుర్తించినట్టు యూజర్లు చెప్తున్నారు.
ఒక ఫొటో థ్రెడ్ను డిలీట్ చేయగానే.అందులోని ఫొటోలు ఫోన్ మెమరీలో నుంచి కూడా డిలీట్ అయిపోతున్నాయని యూజర్లు యాపిల్ కమ్యూనిటీకి ఫిర్యాదు చేస్తున్నారు.
సాధారణంగా వాట్సాప్ లో ఒక చాట్ ను డిలీట్ చేసినా అందులోని ఫొటోలు ఫోన్ మెమరీలో ఉంటాయి.ఇది అన్ని మెసేజెస్ యాప్స్ లో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్.
కానీ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని బగ్స్ కారణంగా ఈ ఫీచర్ పనిచేయడం లేదని తెలుస్తోంది.ఈ ఫొటోలు ఐఫోన్ క్లౌడ్ లో స్టోర్ అవుతాయని యాపిల్ కమ్యూనిటీ చెప్తుంది కానీ అక్కడ కూడా ఫొటోలు కనిపించడం లేదని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదొక్కటే కాదు మరిన్ని సమస్యలను కూడా కనిపెట్టారు వినియోగదారులు.ఫోన్ లోని డిఫాల్ట్ కెమెరా యాప్ లోని నాన్-ఫంక్షనల్ వ్యూఫైండర్ అప్పుడప్పుడు దానంతటదే ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నట్లు వినియోగదారులు కనుగొన్నారు.
డిఫాల్ట్ జీమెయిల్ అప్లికేషన్ కూడా ఫ్రీజ్ అవుతుందని యూజర్లు కంప్లైంట్ ఇచ్చారు.ఐఓఎస్ 15 నుంచి వాయిస్ అసిస్టెంట్ సిరిని కూడా తొలగించారు.దాంతో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇది ఓల్డ్ వెర్షన్ ఐఫోన్ డివైజ్లలో కూడా పనిచేయడం లేదు.ఇప్పటివరకు యాపిల్ సంస్థ ఈ సమస్యలపై స్పందించలేదు.దీనితో ఫొటో థ్రెడ్లను డిలీట్ చేయకుండా ఉండటమే యూజర్లకు తాత్కాలిక పరిష్కారంగా ఉంది.