మనిషికి మంచి స్నేహితుడు ఎవరు అంటే ఆలోచన సరిగా చేసే వారు ఎవరైనా సరే చటుక్కున పుస్తకం అని చెప్పేస్తారు.కొన్ని పుస్తకాలు సామాన్యులని అసామాన్యులుగా తీర్చి దిద్దుతాయి.
అందుకే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ, ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటారు పెద్దలు.పుస్తకానికి అంత విలువ ఉంటుంది కాబట్టే అమెరికాలో తెలుగు సంఘాలలో ఒకటైన అతిపెద్ద సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) పుస్తక మహోద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది.
డల్లాస్ లో పుస్తక మహోద్యమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు తెలుగు కుటుంబాలు భారీ స్థాయిలో హాజరయ్యారు.ఇంట్లో పిల్లలకు తెలుగు బాషను నేర్పించేలా చర్యలు చేపట్టాలని తానా సంస్థ సభ్యులు కోరారు.అలాగే పుస్తక పటనం పిల్లలలో మేధా శక్తిని పెంచుతుందని అందుకే పుస్తకాలు కొని మరొకరికి బహుమతిగా ఇచ్చే అలవాటును అందరికి చేయాలని పుస్తక మహోద్యమ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తానా సాహిత్య వేదిక డా. తోటకూర ప్రసాద్ ప్రకటించారు.విద్య, జ్ఞానం, సంస్కారం, గురువులు, తల్లి తండ్రుల ద్వారా మనకు అందుతుందని, అయితే వాటిని మరింత పదును పెట్టేందుకు పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు.
తానా చేపట్టిన ఈ పుస్తక ఉద్యమంలో భాగంగా 25 వేల పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించామని ఈ టార్గెట్ చేరుకోవడం సామాన్యమైన విషయం కాదని కానీ ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ఎంతో మంది పుస్తకాలని బహుమతులుగా ఇస్తూ వారి ఫోటో లను తమకు పంపుతున్నారని అలాంటి వారందరికి తానా తరుపున కృతజ్ఞతలు తెలిపుతున్నామని ప్రకటించారు.తానా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టినా సరే ముందుండి నడిపిస్తున్న సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
.