కరోనా ఎంట్రీ వచ్చిన రోజు మొదలు ఈ రోజు వరకూ ఎవరూ ప్రశాంతమైన జీవితం గడిపింది లేదు.అనుమానంతో బయటకి వెళ్ళడం, ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు అలోచించి తినడం, దగ్గు వచ్చినా, వాతావరణ మార్పుల వలన జ్వరం వచ్చినా కరోనా వచ్చిందా అనే అనుమానాలతో మానసికంగా కుంగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
ఈ క్రమంలోనే మానసిక వేదనతో ఇంట్లోనే గడుపుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ఇలాంటి కష్ట కాలంలో ఆన్లైన్ లో తెలుగు వారికోసం అమెరికాలోని తెలుగు సంఘం నాట్స్ ఓ వినూత్నమైన కార్యక్రమాని ఏర్పాటు చేసింది.
హ్యాపీ టో త్రైవ్స్ తో కలిసి తమ సంస్థ సభ్యుల కోసం నృత్య శిక్షణ, మానసిక ఆరోగ్యం ఎలా దృడంగా ఉంచుకోవాలి అనే రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమాలని ఊహించని విధంగా భారీ స్పందన వచ్చింది.
ఇళ్ళలోనే ఉంటూ మానసికంగా కుంగిపోతున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఉల్లాసాన్ని కలిగించింది.ఈ కార్యక్రమాన్ని యువ నటుడు , డ్యాన్స్ మాస్టర్ అయిన రోనాక్ తో ఏర్పాటు చేయించింది.
ఈ కార్యక్రమాన్ని హ్యాపీ టూ త్రైవ్స్ నిర్వాహకులు సమన్వయము చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ తెలుగు, హిందీ, తమిళ భాషలలో హిట్స్ సాంగ్స్ కి డ్యాన్స్ ఎలా చేయాలో రోనక్ చేసి వారితో కూడా చేయించే ప్రయత్నం చేశారు.
సుమారు 200 మందికి పైగా ఈ వెబ్ నార్ లో పాల్గొన్నారు.ఇక మానసిక ఆరోగ్యంపై డాక్టర్ రోషన్ అవగాహన కల్పించారు.కరోనా సమయంలో మానసికంగా వచ్చే సమస్యలని ధృడంగా ఉంటూ ఎలా ఎదుర్కోవాలో వివరించారు.మానసికంగా ధృడంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని తెలిపారు.
ఈ రెండు కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పాల్గొన్న వారు సంతోషం వ్యక్తం చేశారు.నాట్స్ కి ధన్యవాదాలు తెలిపారు.