కరోనాపై పోరాటంలో అందరం భాగస్వామ్యం అవుతున్నాం, అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నాం అంటూ తెలియజేసేలా భారత ప్రధాని నరేంద్ర మోడీ 5వ తారీకు రాత్రి 9 గంటకు ప్రతి ఒక్కరు కూడా 9 నిమిషాల పాటు లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.కొందరు మోడీ పిలుపుపై విమర్శలు కురిపిస్తే మరికొందరు మాత్రం మోడీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ ప్రకటించారు.
మిశ్రమ స్పందన వస్తుందనుకు ఈ కార్యక్రమంకు అనూహ్య స్పందన దక్కింది.
దేశంలో దాదాపు 85 శాతం మంది లైట్లు ఆర్పేసి దీపాు వెలిగించినట్లుగా తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ వెనుకే మేము అన్నట్లుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి కరోనాపై పోరాటంకు తమ సంఫీుభావంను తెలియజేశారు.ఈ సందర్బంగా మోడీ చెప్పినట్లుగా పలువురు పలు రకాల వెలుగులతో వరండా లేదా డోర్ వద్దకు వచ్చి దీపాలను చూపించారు.
కొందరు అవివేకులు క్రాకర్స్ కూడా కాల్చడం చర్చనీయాంశం అయ్యింది.మొత్తానికి అయితే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సూపర్ హిట్ అయినట్లే అంటూ అంతా అనుకుంటున్నారు.