కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ లో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.ఏసియన్ సినిమాస్ లో నారాయణ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాకు ధనుష్ ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకపోతే ఎలా అంటున్నారు ఆ హీరో ఫ్యాన్స్.
కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరో ధనుష్ అతను చేస్తున్న సినిమాలు కేవలం రికార్డ్ కలక్షన్స్ తో పాటుగా అవార్డులు కూడా తెచ్చి పెడుతున్నాయి.లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ ను సైతం మరోసారి అందుకున్న ధనుష్ తెలుగు దర్శకుడితో సినిమా చేయడం క్రేజీగా ఉంది.
ధనుష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది.శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తర్వాత ఈ సినిమా చేస్తున్నారు.సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్ లెక్కలు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ధనుష్, సాయి పల్లవి ఆల్రెడీ మారీ 2తో ఫుల్ క్రేజ్ తెచ్చుకోగా మరోసారి ఈ జోడీ అలరించనుంది.