కేంద్ర వార్షిక బడ్జెట్ వేతన జీవులకు భారీ ఊరటను కలిగించింది.ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఈ మేరకు ఉద్యోగులకు ఊరటను ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు.ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచనున్నారు.కాగా ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి వర్తించనుంది.
ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధించనున్నారు.ఈ కొత్త పన్ను విధానంలో రూ.9 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.45 వేలు పన్ను,.రూ.15 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.లక్షా 50 వేలు కట్టాల్సి ఉంటుంది.ఆదాయం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటే 30 శాతం పన్ను విధించనున్నారు.