కోలీవుడ్ స్టార్ హీరోలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది.ఈ నేపధ్యంలో సూర్య, కార్తీ, విక్రమ్, విజయ్, అజిత్, కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలని తెలుగులో నేరుగా రిలీజ్ చేస్తూ ఉంటారు.
వీరి సినిమాలని తెలుగు ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలతో సమానంగా ఆదరిస్తారు.ఈ స్టార్ హీరోల సినిమాలకి థియేటర్ లో మంచి ఓపెనింగ్స్ కూడా ఉంటాయి.
ఈ కారణంగానే తెలుగు థీయాట్రీకల్ రైట్స్ ని ఇక్కడి నిర్మాతలు భారీ ధర వెచ్చించి కొనుగోలు చేస్తూ ఉంటారు.ఎక్కువగా సూర్య, విక్రమ్ సినిమాలకి గతంలో మంచి డిమాండ్ ఉండేది.
ఇప్పుడు ఆ డిమాండ్ మిగిలిన హీరోలకి కూడా ఉంది.ఇక సినిమా స్టాండర్డ్ కూడా పెరగడంతో దర్శకులు యూనివర్శల్ కాన్సెప్ట్ లని తీసుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఆ కథలు అన్ని బాషలలో ప్రేక్షకులని అలరిస్తున్నాయి.ఇప్పటికే మన తెలుగు స్టార్స్ యూనివర్శల్ కథలతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు.
ఇప్పుడు తమిళ్ స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా కథలపైనే ఫోకస్ చేస్తున్నారు.విజయ్ మాస్టర్ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా వాలిమై అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ హైదరాబాద్ లో రామోజీలోనే జరిగింది.ఇందులో ప్రతినాయకుడుగా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్ రైట్స్ ని చిత్ర నిర్మాతలు అమ్మేశారు.
ఈ డబ్బింగ్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.బోణీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్ బాషలలో ఒకే సారి రిలీజ్ కాబోతుందని టాక్.