పొట్ట చేత బట్టుకుని దేశం కాని దేశం వెళ్లి ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని కుటుంభ సభ్యులకు దూరంగా ఉంటూ రేయింబవళ్ళు కష్టపడుతూ ఒక్కో రూపాయి వెనకేసుకునే వలస కార్మికులు దుబాయ్ దేశాలలో లెక్కకు మించి ఉంటారు.అలా వెళ్ళిన వారికి ఊహించని విధంగా, అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది.
ఊహించుకుంటేనే చాలా షాకింగ్ గా ఉంటుంది కదా, మరి అలాంటి సంఘటనను నిజంగా అనుభవించిన వారికి ఇంకెలా ఉంటుంది చెప్పండి.అబుదాబి వెళ్ళిన భారతీయ జంటకు అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.
భారత్ నుంచీ ఎన్నో ఏళ్ళ క్రితమే షార్జా వెళ్లి స్థిరపడిన బిజేష్ బోస్ అనే వ్యక్తి అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ ఆర్ధికంగా స్థిరపడాలని భావించారు.ఈ క్రమంలోనే అక్కడ అధికారికంగా నిర్వహించే అబుదాబి బిగ్ టికెట్ లో లాటరీ టికెట్లను తన స్నేహితులతో కలిసి కొనుగోలు చేశారు.
ఇదిలాఉంటే లాటరీ టిక్కెట్టు కొన్న రెండు రోజులకు అతడి భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.దాంతో లాటరీ టిక్కెట్టు వచ్చినా రాకున్నా కవలలు పుట్టారు చాలు అనుకున్నాడు బోస్.
ఈక్రమంలో అబుదాబి బిగ్ టికెట్ లో బహుమతి గెలుచుకున్నారని, మీరు కొన్న టిక్కెట్టు కు రూ.2 కోట్లు వచ్చినట్టుగా నిర్వాహకులు ఫోన్ చేసి విషయం చెప్పడంతో బోస్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.కేవలం రోజుల వ్యవధిలో తనకు పిల్లలు పుట్టడం, అది కూడా కవల పిల్లలు పుట్టడం, అలాగే లాటరీ లో కోట్లు కలిసి రావడంతో బోస్ ఉబ్బితబ్బిబ్బై పోయాడు.తన జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చూడలేదని ఇదే మొదటి సారని తెలిపాడు.
ఈ టిక్కెట్టును స్నేహితులు కొందరం కలిసి కొన్నామని, వచ్చిన లాటరీ మొత్తంలో అందరు పంచుకున్న తరువాత నాకు వచ్చిన డబ్బులతో పిల్లలకు మంచి చదువు చెప్పించి,వ్యాపారం చేస్తానని తెలిపాడు బోస్.