భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గంజాయి భారీగా పట్టుబడింది.కూనవరం రోడ్డు చెక్ పోస్ట్, సీఆర్ఫీఎఫ్ క్యాంపు వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో పోలీసులు 485 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న ట్రాకర్ట్ ను సీజ్ చేసిన అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని భావిస్తున్నారు.