గత సంవత్సరం ప్రజలతో కరోనా ఆడుకుంటే ఈ సంవత్సరం ప్రమాదాలు తెగ చెలరేగుతున్నాయి.ఇప్పటికే పలుచోట్ల చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి.
ఇక తాజాగా మహారాష్ట్రలోని పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందట.దాదాపుగా ఐదు వందలకు పైగా షాపులు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయని సమాచారం.
కాగా పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్ చిన్న చిన్న బట్టల దుకాణాలకు, గ్రాసరీ షాపుల వంటి వాటికి ఫేమస్.నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం చిరువ్యాపారుల పాలిట వరం.ఇక నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.కాగా ప్రస్తుత ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందట.
ఇక చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లో విస్తరించడంతో షాపులలో ఉండే వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.అయితే ఈ మంటలను ఆర్పడానికి సుమారు 50 ఫైరింజన్లు పని చేశాయి.
ఇక ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ప్రాణనష్టమేమీ సంభవించలేదని, కానీ చిన్న వ్యాపారులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని అధికారులు తెలిపారు.