కోల్ కతాలో తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు.
నలుగురు ఫైర్ మాన్ లు, ఒక పోలీసు ఉన్నతాధికారి ఇద్దరు రైల్వే ఆఫీసర్ లు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మరణించడం జరిగింది.దీంతో సంఘటనా స్థలానికి హుటాహుటిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోపాటు మంత్రులు రావడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరుగగా మంగళవారం నాటికి తొమ్మిది మంది మరణించడం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు మండల పాలన ప్రయత్నాలు చేయగా ఆ భవనం చాలా ఎక్కువగా ఉండటంతో.అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన వేసుకుని ఆర్పే ప్రయత్నాలు చేసే పరిస్థితి కూడా లేకపోవటంతో .ఈ విషాద సంఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే జరిగిన సంఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదానికి గల అసలు కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.