రంగారెడ్డి జిల్లాలో ఫేక్ కరెన్సీ కల్లోలం రేపింది.పక్కా సమాచారంతో చాకచాక్యంగా వ్యవహరించిన పోలీసులు మైలార్ దేవ్ పల్లిలో భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి భారీగా ఫేక్ కరెన్సీ తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించనున్నారు.