మనదేశం అవినీతికి పుట్టిల్లు లాంటిదని అంటారు.ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అవినీతి మరే దేశంలో జరుగదేమో.
ఒక తల్లి పాలను అంగట్లో అమ్మడం తప్ప మిగతావన్ని అవినీతి రంగు పులుముకున్నవే.దోచుకున్న వాడికి దోచుకున్నంత రాజభోగం లభిస్తుంది.
అందుకే చిన్న స్దాయి ఉద్యోగి నుండి అధికార స్దాయి వరకు లంచాలకు మరిగిన ప్రభుద్దులు అడుగడుగున కనిపిస్తారు.
ఇకపోతే మరో అవినీతి భాగోతం ఏపీలోని ప్రభుత్వ వైన్ షాపుల్లో బయటపడింది.
విశాఖ పరిధిలోని 14 షాపుల్లో లక్షల రూపాయలు పక్కదారి పట్టించిన సిబ్బంది వ్యవహారం బయట పడటంతో అప్రమత్తమైన అక్రమార్కులు పరువు బజారుకు ఎక్కకుండా నొక్కేసిన నగదు చెల్లించేందుకు అంగీకరించినట్టు సమాచారం.అయితే ఈ అవినీతి వ్యవహారం లో అధికారులు ఎక్సయిజ్ సిఐ శ్రీనివాస్ పై వేటు వేశారట.
ఇలా ఏ శాఖలో చూడు అవినీతి చేపల నుండి తిమింగళాలు ఉండగా రాష్ట్రం ఎక్కడ బాగు పడుతుంది.